నాడు అధ్వానంగా.. నేడు అద్దంలా..
ABN, Publish Date - Jun 25 , 2025 | 11:59 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులు ఎంతో బాగు పడుతున్నాయి.
- రూ.40లక్షలతో బాలసీమ రోడ్డు అభివృద్ధి
- ప్రయాణికుల ఆనందం
నరసన్నపేట, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులు ఎంతో బాగు పడుతున్నాయి. దీనికి ఉదాహరణే బాలసీమ రోడ్డు. ఈ రహదారి ఒకప్పుడు గోతులు, రాళ్లతో దారుణంగా ఉండేది. దీనిపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోయేవారు. వర్షాకాలంలో వాహన చోదకులు నరకం చూసేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డుని కనీసం పట్టించుకోలేదు. ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే బసివలస నుంచి బాలసీమ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.40లక్షలు మంజూరు చేసింది. పనులు కూడా పూర్తవడంతో ప్రస్తుతం ఈ మార్గం అద్దంలా మారింది. దీంతో ఈ రోడ్డులో ప్రయాణం చేసే నరసన్నపేట, జలుమూరు మండలాలకు చెందిన పలు గ్రామాలకు చెందిన వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 25 , 2025 | 11:59 PM