సాగు చేస్తున్నాం.. న్యాయం చేయండి
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:50 PM
:1979 సంవత్సరం నుంచి సర్వేనెంబరు 198/1లో ఉన్న 62 సెంట్లు భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇది తమ భూమని కొందరు దౌర్జన్యం చేస్తూ ఆటంకం కల్పిస్తున్నారని బాధిత రైతులు త్రిలోచన పాత్రో, ప్రభావతి పాత్రో వాపోయారు.
పలాస, జూన్ 30(ఆంధ్రజ్యోతి):1979 సంవత్సరం నుంచి సర్వేనెంబరు 198/1లో ఉన్న 62 సెంట్లు భూమిని సాగుచేసుకుంటున్నామని, ఇది తమ భూమని కొందరు దౌర్జన్యం చేస్తూ ఆటంకం కల్పిస్తున్నారని బాధిత రైతులు త్రిలోచన పాత్రో, ప్రభావతి పాత్రో వాపోయారు.ఈమేరకు పలాసలో జరిగిన పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యా దుచేశారు. దీంతో రైతులతో కలిసి వివాదానికి కారణమైన భూమిని పరిశీలించారు. ఈసందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఉదయపురం రెవెన్యూ పరిధిలో ఉన్న62 సెంట్లు 1978లో లండ దండాసి నుంచి కొనుగోలుచేశామని, ప్రస్తుతం తమ ఆధీనంలోఉన్నట్లు పొజిషన్సర్టిఫికెట్ కూడా ఉందని తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్, డ్యాకు మెంట్లుపట్టుకొని తమపై ఓ కుటుంబందౌర్జన్యానికి దిగుతోందని వాపోయారు. రెవెన్యూ అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. బాధిత రైతులకు మద్దతుగా టీడీపీ, వైసీపీ నాయకులు బలరామ్బెహరా, టి.హరినాథ్, కృష్ణనాయక్, లోకనాధబెహరా, బుట్టురాజులు, ఐ.మల్లేశ్వరరావు కలెక్టర్ను కలిశారు.
Updated Date - Jun 30 , 2025 | 11:50 PM