వైసీపీ వల్లే ఉత్తరాంధ్ర వెనుకుబాటు
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:00 AM
వైసీపీ విధ్వంసం పరిపాలన వల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురయ్యిందని శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి ధ్వజమెత్తారు.
కొత్తూరు, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): వైసీపీ విధ్వంసం పరిపాలన వల్ల ఉత్తరాంధ్ర వెనుకబాటుకు గురయ్యిందని శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి ధ్వజమెత్తారు.శుక్రవారం మండలం లోని మాతల క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడుతూ రాజధాని లేని విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆహోరాత్రులు కష్టపడి చేసిన అభివృద్ధిని దుర్మార్గవిధానాలతో వెనక్కి నెట్టారని ఆరోపించా రు. వైసీపీ నాయకులు లూలు గ్రూపు సంస్థ పారిపోయేలా చేసి ఉత్తరాంధ్ర యువత పొట్టకొట్టారని విమర్శించారు. రుషి కొండ ఐటీ సెజ్ నుంచి 14 కంపెనీలు పారిపోయేలా చేయడమే కాకుండా ప్రాంక్లిన్ టెంప్లున్, హెచ్సీఎల్, ఐబీమ్, ఫింటెక్స్, హెచ్ఎస్బీసీ, షుగర్ ప్యాక్టరీలు, దిగ్గజ కం పెనీలు వైసీపీనాయకులదాష్టికాలను భరించలేక రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోయా యని తెలిపారు.టీడీపీప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలో టీసీఎస్ రూ.1370 కోట్లు పెట్టుబడితో 12వేలమందికి ఉద్యోగాల కల్పనకు ముందుకొస్తోందని తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 12:00 AM