10 కిలోల గంజాయితో ఇద్దరు ఒడిశా వాసులు అరెస్టు
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:06 AM
ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంబ ప్రాంతం నుంచి ఆ రాష్ట్రానికి చెందిన చెందిన ఇద్దరు వ్యక్తులు 10 కిలోల గంజాయిని బెంగుళూరు తరలిస్తుండగా పట్టుబడినట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు.
నరసన్నపేట, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంబ ప్రాంతం నుంచి ఆ రాష్ట్రానికి చెందిన చెందిన ఇద్దరు వ్యక్తులు 10 కిలోల గంజాయిని బెంగుళూరు తరలిస్తుండగా పట్టుబడినట్టు సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మంగళవారం మడపాం టోల్ప్లాజా వద్ద ఎస్ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీ చేస్తుండగా.. వేరొక వాహనంలో వచ్చిన బసంత మహాపాత్రో, సిద్దాంత స్వాన్ పోలీసులను చూసి పోరిపోయేం దుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారిద్దరి పట్టుకుని బ్యాగ్ లు తనిఖీ చేశారు. అందులో 10కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఇరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ స్పష్టం చేశారు.
Updated Date - Jul 09 , 2025 | 12:06 AM