మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:08 AM
మత్స్యకారుల సం క్షేమమే ప్రభు త్వం ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
మత్స్యకార భరోసా పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
గార, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల సం క్షేమమే ప్రభు త్వం ధ్యేయమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం ఉదయం ఆయన బలరాంపురంలో మత్సకారుల భరోసా అందజేశారు. తొలుత సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు.. వేట నిషేధ భృతిని రూ.20వేలు చొప్పున అందించారు. ఇంకా కొంతమంది మత్స్యకారులకు భరోసా అందలేదని తన దృష్టికి వచ్చిందని, ఈ విషయమై పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:08 AM