జోనల్ స్థాయిలో టెక్కలి డిపోకు రెండో స్థానం
ABN, Publish Date - May 28 , 2025 | 12:11 AM
టెక్కలి ఆర్టీసీ డిపో అందిస్తున్న సేవల్లో జోనల్ స్థాయిలో రెండో స్థానం నిలిచిందని ఆర్టీసీ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ (ఈడీ) కేఎస్ బ్రహ్మా నంద రెడ్డి అన్నారు.
ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి
టెక్కలి, మే 27(ఆంధ్రజ్యోతి): టెక్కలి ఆర్టీసీ డిపో అందిస్తున్న సేవల్లో జోనల్ స్థాయిలో రెండో స్థానం నిలిచిందని ఆర్టీసీ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ (ఈడీ) కేఎస్ బ్రహ్మా నంద రెడ్డి అన్నారు. మంగళవారం టెక్కలి డిపోను సందర్శించారు. ఈ సంద ర్భంగా ఉద్యోగులు, సిబ్బంది పని తీరుపై సమీక్షించారు. డిపో పరిధిలో అన్ని విభాగాలు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నాయని, ఇదే స్పూర్తితో పనిచేసి ప్రయా ణికుల మన్ననలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా కండక్టర్ పీవీకే రాజు, ఎస్.రాజులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఆర్టీసీ పార్శిల్ సర్వీస్లో అత్యధిక బుకింగ్లు చేసిన వినియోగ దారులు మధు, సుగుణ కుమార్లకు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్, డిపో మేనేజర్ శ్రీనివా సరావు, సరుకు రవాణా సహాయ మేనేజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 28 , 2025 | 12:11 AM