దాడిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:00 AM
కొచ్చెర్ల సచివాలయం డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కె.మోహన్రావుపై అదే గ్రామ సర్పంచ్ భర్త బసవ గోవిందరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
రణస్థలం, జూన్ 23(ఆంధ్రజ్యోతి): కొచ్చెర్ల సచివాలయం డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కె.మోహన్రావుపై అదే గ్రామ సర్పంచ్ భర్త బసవ గోవిందరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలంలో సచివాలయం సిబ్బంది సోమవారం ఇన్చార్జి ఎంపీడీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. డిజిటల్ అసిస్టెంట్ మోహన్రావు యోగాంరఽధ, తల్లికి వందనం, గ్రీవెన్స్ ఫిర్యాదులతో బిజీలో ఉన్న సమయంలో గత శుక్రవారం బసవ గోవిందరెడ్డి సచివాలయానికి దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని లాగాడని తెలిపారు. తక్షనమే గోవిందరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. కార్యక్రమంలో పలువురు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:00 AM