పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:20 PM
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరిక సంఖ్యను పెంచాలని డీఈవో తిరుమల చైతన్య అన్నారు.
జలుమూరు, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరిక సంఖ్యను పెంచాలని డీఈవో తిరుమల చైతన్య అన్నారు. జలుమూరు ప్రాథమిక, చల్లవానిపేట ఉన్నత శాలలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమైనందను ఎక్కువ మంది విద్యార్థు లు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకో వాలన్నారు. 10వ తరగతి విద్యార్ధులకు ఇప్పటి నుండే ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాల న్నారు. మధ్యాహ్న భోజనంలో పిల్లలకు నా ణ్యమైన, శుచికరమైన పౌష్టికాహారం అందించాలన్నారు. చల్లవానిపేట పాఠశాలకు ప్రహారీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. రికార్డులను పరిశీలించారు. కార్యక్రమం లో ఉన్నతపాఠశాల హెచ్ఎం నిర్మలాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 11:20 PM