jai Bharath: జయహో భారత్
ABN, First Publish Date - 2025-05-08T23:50:24+05:30
Victory to India పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీ కారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత సైన్యానికి మద్దతుగా గురువారం టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో ‘జయహో భారత్’ అంటూ జాతీయపతాకాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీ చేపట్టారు.
‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా ర్యాలీ
టెక్కలి/ పలాస, మే 8(ఆంఽధ్రజ్యోతి): పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీ కారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత సైన్యానికి మద్దతుగా గురువారం టెక్కలిలోని ఇందిరాగాంధీ కూడలిలో ‘జయహో భారత్’ అంటూ జాతీయపతాకాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీ చేపట్టారు. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులు చేసి విజయవంతమైన సైనికులకు సెల్యూట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి, నేతలు హనుమంతు రామకృష్ణ, లవకుమార్, జగదీశ్వరరావు, షణ్ముఖరావు, ప్రీతీష్, ప్రసాద్ రెడ్డి, మల్లిపెద్ది మధు, టీఎస్ఎన్ రమణ, కిరణ్ పాల్గొన్నారు.
పలాసలో జీడివ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా జంక్షన్ నుంచి జీడిపండు జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినదించారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్కు కేంద్రప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పింది. దేశాన్ని అస్థిర పరిచే ఏ శక్తులకైనా ఇటువంటి గుణపాఠం తప్పదు. సరిహద్దులో పోరాటం చేస్తున్న సైనికులకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాల’ని కోరారు. కార్యక్రమంలో జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్, కార్యదర్శి టంకాల రవిశంకర్గుప్తా, కోశాధికారి మల్లా సంతోష్, జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వర రావు యాదవ్, టీడీపీ నేతలు పీరుకట్ల విఠల్రావు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, దువ్వాడ శ్రీకాంత్, ఎం.నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2025-05-08T23:50:26+05:30 IST