పట్టుదల ఉంటే క్రీడల్లో రాణించవచ్చు
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:33 PM
క్రమశిక్షణ, పట్టుదల ఉంటే క్రీడల్లో రాణిం చవచ్చని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ గూడేన సోమేశ్వరరావు అన్నా రు.
ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
శ్రీకాకుళం స్పోర్ట్స్, జూలై 13(ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణ, పట్టుదల ఉంటే క్రీడల్లో రాణిం చవచ్చని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ గూడేన సోమేశ్వరరావు అన్నా రు. స్థానిక శాంతినగర్ కాలనీ ఇండోర్ స్టేడియంలో రెండు రోజు లుగా జరుగుతున్న జిల్లా బ్యాడ్మిం టన్ చాంపియన్షిప్ ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. క్రీడాకారులు రాణిస్తున్నారంటే వారి తల్లిదండ్రు ల ప్రోత్సాహం ఎంతైనా ఉందన్నారు. గెలుపు, ఓటము లు సమానంగా స్వీకరించాలన్నారు. జిల్లాలోని మారు మూల ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం జిల్లాస్థాయి విజేత లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు బైరి దామోదర్, ఎంఎంవిలేఖర్, గురుగుబెల్లి రాజు, ఎం.వేణు, సీఈవో సంపతిరావు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:33 PM