ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తి చేయండి
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:42 PM
నరసన్నపేట పట్టణంలో అర్ధంతరంగా నిలిచిన ఇండోర్ స్టేడియానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు.
నరసన్నపేట, జూన్ 24(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట పట్టణంలో అర్ధంతరంగా నిలిచిన ఇండోర్ స్టేడియానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మేడిపల్లి రాంప్రసాద్ రెడ్డిని వెలగపూడి సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సంద ర్భంగా బగ్గు మాట్లాడుతూ.. ఇండోర్ స్టేడి యానికి గత టీడీపీ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించగా ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో చల్లవానిపేట సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:42 PM