చంద్రబాబుతోనే అన్ని వర్గాల అభివృద్ధి
ABN, Publish Date - Jul 27 , 2025 | 11:38 PM
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఫఅరసవల్లి,జూలై27(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమా న్ని ఇతర రాష్ట్రాల నేతలు చూస్తున్నారని, దేశం మెచ్చుకునేలా చంద్రబాబు పాలన ఉందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలోని గూనపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ సరుబుజ్జిలి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రొట్టవలస, షలంత్రి పంచాయతీ బురిడివలస గ్రామాల్లో నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి తాడేల రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలిఅడుగు కార్య క్రమం నిర్వహించారు. కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాడేల వెంకటరమణ, నాయకులు బెవర రాజారావు, మూడడ్ల రామకృష్ణ, పాల్గొన్నారు. అలాగే మెట్టక్కివలసలో టీడీపీ నాయకులు మొదలవలస రమేష్ నాగళ్ల మురళీధర్యాదవ్ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.
ఫజి.సిగడాం, జూలై 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెంట, ఆనందపురం, ఆబోతులపేట, దవళపేట, డీఆర్వలస తదితర గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో టీడీపీ మండలా ధ్యక్షుడు కుమరాపు రవికుమార్, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.
ఫరణస్థలం, జూలై 27( ఆంధ్రజ్యోతి ) :రణస్థలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పిన్నింటి భానోజినాయుడు, మజ్జి పండోడు పాల్గొన్నారు.
Updated Date - Jul 27 , 2025 | 11:38 PM