Narayana Schools: నారాయణ జైత్రయాత్ర
ABN, Publish Date - Apr 24 , 2025 | 05:03 AM
ఏపీ పదోతరగతి ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు విశేష విజయాన్ని నమోదు చేశాయి. సాయి తన్వి 599 మార్కులతో ఆల్టైమ్ రికార్డు సృష్టించగా, 88 బ్రాంచీల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించామని డైరెక్టర్లు తెలిపారు.
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితా లలో నారాయణ జైత్రయాత్ర కొనసాగిందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ, రమా నారాయణ తెలిపారు. సాయి తన్వి 599 మార్కులతో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పినట్టు పేర్కొన్నారు. 597 ఆపైన మార్కులు 15 మంది, 596 ఆపైన 39 మంది, 595 ఆపైన 85మంది, 590 ఆపైన 552 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. గణితంలో 1403 మంది, సైన్స్లో 1136 మంది, సోషల్ సబ్జెక్టులో 1088 మంది, తెలుగులో 1149 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారన్నారు. ఏపీలో 511 సగటు మార్కు, అలాగే 98ు ఉత్తీర్ణత సాధించిన ఏకైక విద్యాసంస్థ నారాయణ మాత్రమేనని పేర్కొన్నారు. 88 బ్రాంచీలలో 100ు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 24 , 2025 | 05:03 AM