Raj Kasireddy: జైల్లో వంట చేసుకుంటా.. అనుమతి ఇవ్వండి
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:32 AM
మద్యం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి భోజన సదుపాయానికి సంబంధించి మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి పిటిషన్
మద్యం కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి భోజన సదుపాయానికి సంబంధించి మరోసారి కోర్టును ఆశ్రయించారు. తనకు జైల్లో వంట చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి భోజనం అనుమతించాలని గతంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఆయన మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
Updated Date - Jul 11 , 2025 | 04:33 AM