నేడు త్రిపురాంతకంలో యోగాంధ్ర
ABN, Publish Date - Jun 02 , 2025 | 10:52 PM
త్రిపురాంతకంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తెలిపారు. దాదాపు 2 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ త్రివినాగ్
త్రిపురాంతకం, జూన్ 2, (ఆంధ్రజ్యోతి) : త్రిపురాంతకంలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ తెలిపారు. దాదాపు 2 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. బాలాత్రిపురసుందరీదేవి ఆలయం వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు, ఉదయం 6గంటలకే కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు, ప్రజలు సకాలంలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమం పేరుతో రూపొందించిన టీషర్టులను ఆయన అధికారులకు అందజేశారు.
Updated Date - Jun 02 , 2025 | 10:52 PM