ఇరువురు గేదెల దొంగలు అరెస్ట్
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:44 PM
గేదె లను దొంగతనం చేసిన ఇ రువురు నిందితులను ఎస్సై బి.మహేంద్ర మం గళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువచేసే ఐదు గే దెలను స్వాధీనం చేసుకు న్నారు.
రూ. 3.5 లక్షల విలువచేసే ఐదు పశువుల స్వాధీనం
వివరాలను వెల్లడించిన ఎస్సై మహేంద్ర
సింగరాయకొండ, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : గేదె లను దొంగతనం చేసిన ఇ రువురు నిందితులను ఎస్సై బి.మహేంద్ర మం గళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువచేసే ఐదు గే దెలను స్వాధీనం చేసుకు న్నారు. స్థానిక పోలీస్స్టేష న్లో ఎస్సై మహేంద్ర మా ట్లాడుతూ ఈ నెల 2వ తేదీన మండలంలోని సోమరాజుపల్లికి చెందిన అర్రిబోయిన బ్రహ్మయ్య తన గేదెల షెడ్లో కట్టివేసిన ఐదు గేదెలు మా యమయ్యాయి. బ్రహ్మయ్య స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు న మోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై జరుగుమల్లి మండలం వావిలేటి పాడుకి చెందిన ఒక్కమంతుల ప్రసాద్, రావినూతల కొండలరావు నిందితు లుగా గుర్తించారు. ఇరువురుని మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుం చి ఐదు గేదెలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కందు కూరు కోర్టులో హాజరపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
Updated Date - Jun 24 , 2025 | 11:44 PM