కొత్తపట్నం తీరంలో పర్యాటక అభివృద్ధి
ABN, Publish Date - May 22 , 2025 | 12:50 AM
కొత్తప ట్నం తీరంలో అభివృద్ధి పనులు చేపట్టి వాటి ని ర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల మహి ళలకు అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పే దరిక నిర్మూలన అధికారులు బుధవారం కొత్త పట్నం తీరంలో పర్యటించారు.
నిర్వహణ బాధ్యతలు పొదుపు సంఘాలకు ఇచ్చేందుకు చర్యలు
భూములను పరిశీలించిన సెర్ప్ అధికారులు
కొత్తపట్నం, మే 21(ఆంధ్రజ్యోతి): కొత్తప ట్నం తీరంలో అభివృద్ధి పనులు చేపట్టి వాటి ని ర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల మహి ళలకు అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పే దరిక నిర్మూలన అధికారులు బుధవారం కొత్త పట్నం తీరంలో పర్యటించారు. సెర్ప్ అధికారు లతో పాటు మత్స్యశాఖ, రెవెన్యూశాఖ అధికారు లు కలిసి పర్యాటక అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించారు. కాటేజీల నిర్మాణం, హోటల్స్, పర్యాటకులకు స్నానపు గదులు, పొ దుపు సంఘాల మహిళలు తయారు చేసిన వ స్తువుల విక్రయాలకు షాపుల నిర్మాణానికి అ నువైన ప్రాంతాన్ని రాష్ట్ర పేదరిక నిర్మూలనా సంస్థ స్టేట్ డైరెక్టర్ పద్మావతి, మత్స్యశాఖ అ సిస్టెంట్ సంగాని శ్రీనివాసరావు, డీఆర్డీఏ ప్రా జెక్టు డైరెక్టర్ నారాయణ తదితరులు పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయా పనులు చేప ట్టి నిర్వహణ బాధ్యతలు పొదుపు సంఘాల మ హిళలకు అప్పగించడంపై స్థానిక అధికారులతో చర్చించారు.
వివరాలు అందించలేకపోయారు..
కొత్తపట్నం తీరంలో టూరిజం అభివృద్ధికి అనువైన స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన సెర్ప్ రాష్ట్ర అధికారులకు స్థానిక రెవెన్యూ అధి కారులు స్థలం వివరాలను అందించలేకపోయా రు. స్థానిక రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు త మకు వివరాలు తెలియవంటూ అధికారులకు సెలవిచ్చారు. తొలుత కొత్తపట్నం పల్లెపాలెం కు దక్షిణం వైపు ఉన్న తీరంలోని స్థలాన్ని పరి శీలించారు. ఈ భూములు ఎస్సీల టెనెంట్ సొ సైటీకి సంబంధించినవి తెలియటంతో పల్లెపా లెంకు ఉత్తరంవైపు తీరంలో ఉన్న భూములను పరిశీలించారు. అయితే ఈ భూములు రంగా యపాలెం పంచాయతీ పరిధిలోనివి అని, తమ కు కె.పల్లెపాలెం భూములు వివరాలు మాత్ర మే తెలుసుని గ్రామ రెవెన్యూ అధికారి, సర్వే యర్ చెప్పటంతో రాష్ట్ర అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండానే వెనుదిగారు. గతంలో ఇబ్బందిపురం గ్రామం ఉన్న ప్రాంతం లోనే టూరిజం పనులు చేపట్టి వాటి నిర్వహణ బాధ్యతలను పొదుపు సంఘాల మహిళలకు అ ప్పగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసి సెర్ప్కు పంపాలని డైరెక్టర్ పద్మావతి కోరారు. కార్యక్ర మంలో జిల్లా మత్స్యకారుల సహాకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, సెర్ప్ అధికారి మహిత, ఎంపీఎం విజయకుమారి త దితరులు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:50 AM