వీరులకు అభివందనాలు
ABN, Publish Date - May 18 , 2025 | 10:41 PM
సిందూర్ యుద్ధంలో పోరాడి విజయం సాధించిన సైనిక వీరులకు అభివందనాలని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మండల కేందంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వఅధికారులు ఆదివారం జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
తిరంగా ర్యాలీలో ఎరిక్షన్బాబు
ఎర్రగొండపాలెం, మే 18 (ఆంధ్రజ్యోతి) : సిందూర్ యుద్ధంలో పోరాడి విజయం సాధించిన సైనిక వీరులకు అభివందనాలని టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం మండల కేందంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వఅధికారులు ఆదివారం జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. దేశరక్షణ కోసం పోరాడి వీరమరణం పొందారని టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అదేశాలతో ప్రభుత్వ అధికారులు తిరంగా యాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు. ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో పీ ఆంజనేయులు, టీడీపీ ముఖ్యనాయకులు చిట్యాల వెంగళరెడ్డి, తోట మహేష్, వేగినాటి శ్రీను, మంత్రునాయక్, సత్యనారాయణ గౌడ్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 10:41 PM