ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ హయాంలో ఆర్టీసీ అస్తవ్యస్తం

ABN, Publish Date - Jun 02 , 2025 | 10:56 PM

వైసీపీ పాలనలో ఆర్టీసీ సంస్థ అస్తవ్యస్తంగా మారి, అభివృద్ధికి నోచుకోలేదని నెల్లూరు ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ ఎస్‌.సురేశ్‌రెడ్డి విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌లో మరుగుదొడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలిసుతన్న జోనల్‌ చైర్మన్‌ సురేశ్‌రెడ్డి

జోనల్‌ చైర్మన్‌ సురే్‌షరెడ్డి

మార్కాపురం వన్‌టౌన్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో ఆర్టీసీ సంస్థ అస్తవ్యస్తంగా మారి, అభివృద్ధికి నోచుకోలేదని నెల్లూరు ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ ఎస్‌.సురేశ్‌రెడ్డి విమర్శించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్‌లో మరుగుదొడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండ్‌లో కాంట్రాక్టర్ల పనితీరు, అధికారుల నిర్లక్ష్యం, క్యాంటీన్‌లలో అధిక ధరలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత వైసీపీ పాలకులు ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప అభివృద్ధి అనేది లేదన్నారు. చివరకు డిపోలను కూడా తనఖా పెట్టి దుర్వినియోగం చేశారన్నారు. రోడ్లు సరిగా లేక బస్సులు దెబ్బతిన్నాయని, కార్మికులు కష్టాలు పడ్డారని, ఆనారోగ్యంబారిన పడ్డారన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా జీతాలు చెల్లించలేని పరిస్థితికి వారు తీసుకొచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆర్టీసీ నష్టాలకు ముఖ్య కారణం డీజిల్‌ ధరలు పెరగడమేనన్నారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీలో 2900 ఎలక్ట్రికల్‌ బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. బస్సులకు కేంద్రం సబ్సిడీ ఇస్తుందన్నారు. మరో 700 బస్సులు పట్టణాల్లో కేటాయిస్తామన్నారు. 3600 బస్సులు పాత స్థానంలో కేటాయించామన్నారు. మరో 950 కొత్త బస్సులకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఆర్టీసీ బస్టాండ్‌, డిపోలలో పరిశుభ్రత పెంచాలన్నారు. కాంట్రాక్టర్ల పనితీరు మెరుగపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విలువైన ఆర్టీసీ బస్టాండ్‌ల స్థలాలు కాపాడుతామన్నారు. మార్కాపురం బస్టాండ్‌కు కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణం, హైదరాబాద్‌, బెంగళూరు బస్సులు ఆగేచోట నూతన సీసీ ఫ్లాట్‌ఫాంను ఏర్పాటు చేస్తామన్నారు. బస్టాండ్‌లో ఆర్‌వో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ప్రయాణికులకు తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సంఘం నాయకులు ఆర్‌కేజే నరసింహం, నల్లాన్‌ చక్రవర్తుల నరసింహాచార్యులు, మార్కాపురం నుంచి బెంగళూరుకు ఇంద్ర స్లీపర్‌ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైలం నుంచి తిరుపతికి వెళ్లే బస్సులు మార్చాలన్నారు. మార్కాపురం నుంచి హైదరాబాద్‌కు ఉదయంపూట ఒక బస్సును ఏర్పాటు చేయాలన్నారు. వివిధ సమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ నరసింహులు, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 10:56 PM