రైల్వే పనులను వేగవంతం చేయాలి
ABN, Publish Date - May 05 , 2025 | 10:35 PM
నడికుడి - శ్రీకాళ హస్తి రైల్వే పనులను వేగవంతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమ వారం పట్టణ సమీపంలోని కలగట్ల వద్ద ఉన్న రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
కనిగిరి, మే 5 (ఆంధ్రజ్యోతి): నడికుడి - శ్రీకాళ హస్తి రైల్వే పనులను వేగవంతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. సోమ వారం పట్టణ సమీపంలోని కలగట్ల వద్ద ఉన్న రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో అన్ని పనులు పూర్తయ్యేవిధంగా అధికారులు మరింత చొరవ చూ పాలని సూచించారు. ముఖ్యంగా ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనపై అఽధికారులు మరిం త దృష్టి సారించాలన్నారు. కనిగిరి నియోజకవర్గంలో దాదాపు మూడు ర్వైల్వే స్టేషన్లు తుది దశకు చేరు కున్నట్లు అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. యడవ ల్లి, కనిగిరితో పాటు గార్లపేటలో కూడా స్టేషన్ నిర్మాణ పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, కవర్ బ్రిడ్జిలతో పాటు ఫ్లాట్పాంలు, ప్యాసింజర్ వెయిటింగ్ హాల్స్ పనులు వేగవంతగా జరుగుతున్నట్లు వివరించారు. ఆయా పనులను ఎమ్మె ల్యే పరిశీలించారు. మహిళల కోసం ప్రత్యేకంగా వెయిటింగ్ గ దులు, ఏసీ ప్రయాణికుల కో సం వసతి గదులు, జనరల్ క్లా స్ ప్రయాణికులకు మరింత అ నుకూలంగా ఉండే వసతులు అందుబాటులోకి తెచ్చేలా చర్య లు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇటీవల బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సం దర్భంగా కనిగిరికి వచ్చిన సం దర్భంలో మంత్రి నారా లోకేష్ ఆగస్టులో రైల్వే లైన్ ప్రారంభమవుతున్నట్లు ప్రకటించిన విషయాన్ని అధికారులకు ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, కాంట్రాక్టర్లు, తహసీ ల్దార్ రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 10:35 PM