ప్రాథమిక పాఠశాలలను పటిష్టపరచాలి
ABN, Publish Date - Apr 21 , 2025 | 12:56 AM
ప్రాథమిక పాఠశాలలను ప్రభు త్వం పటిష్టపరచాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ఒంగోలు(రూరల్), ఏప్రిల్20(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలలను ప్రభు త్వం పటిష్టపరచాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఒంగోలులోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మా ట్లాడుతూ 1, 2 తరగతులను హైస్కూల్లో విలీనం చేవద్దని, గత వైసీపీ ప్రభు త్వంలో ఇప్పటికే హైస్కూల్లలో 3,4,5తరగతులను విలీనం చేసిందని చెప్పా రు. ఈక్రమంలో కూటమి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను పటిష్ట పరిచేం దుకు 1 నుంచి 5వ తరగతులు ఒకే చోట ఉంచాలని కోరారు. హైస్కూళ్లలో ప్రా థమిక పాఠశాలలను విలీనం చేసే విధానం విరమించుకోవాలని కోరారు. కా ర్యక్రమంలో కేవీజీ.కీర్తి, వై.శ్రీనివాసులు, బి.వెంకటరావు, ఎ.అమ్మయ్య, ఎన్.లక్ష్మీ నారాయణ, బి.అశోక్కుమార్, ఎం.రాఘవరావు, పీవీ.సుబ్బారావులు పాల్గొన్నారు.
Updated Date - Apr 21 , 2025 | 12:56 AM