అమరావతికి వెళ్లే ప్రజల కోసం అన్ని వసతులు
ABN, Publish Date - May 02 , 2025 | 12:14 AM
రా జధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రా రంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూ డాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించా రు.
కలెక్టర్ అన్సారియా ఆదేశం
ఒంగోలు కలెక్టరేట్, మే 1 (ఆంధ్రజ్యోతి): రా జధాని అమరావతి నిర్మాణ పనుల పునః ప్రా రంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూ డాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించా రు. వారికి అవసరమైన తాత్కాలిక వసతి, అ ల్పాహారం అందించేందుకు ఒంగోలులోని విష్ణు ప్రియ కళ్యాణ మండపం, క్విజ్, రైజ్ కాలేజీల్లో చేస్తున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ ఆర్.గో పాలకృష్ణతో కలిసి ఆమె గురువారం రాత్రి ప రిశీలించారు. అన్నమయ్య జిల్లా నుంచి 30 బ స్సుల్లో 1500మంది, కడప నుంచి 70 బస్సుల్లో 3వేల మంది, తిరుపతి నుంచి 70 బస్సుల్లో 3వేల మంది అమరావతికి వెళుతున్నందున శు క్రవారం తెల్లవారుజామున ఒంగోలుకు చేరు కుంటారని కలెక్టర్ తెలిపారు. కొంత విశ్రాంతి అనంతరం అల్పాహారం తిని అమరావతికి మ రలా బయలుదేరి వెళ్తారని చెప్పారు. ఇక ఒం గోలు మండలం నుంచి 2500 మంది, కొత్తప ట్నం నుంచి 500 మంది 60 బస్సుల్లో వెళ్తారని కలెక్టర్ వెల్లడించారు. వీరి కోసం స్థానిక మి నీస్టేడియంలో బస్సులను, అల్పాహారం ఏర్పాట్ల ను జిల్లా అధికారులు చేశారు. అల్పాహారంలో పులిహోర, అరటిపండు, వాటర్బాటిల్స్ రెండు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రణాళిక ప్రకారం సకాలంలో బస్సు లు బయలు దేరి వెళ్ళేలా చూడాలని ఆర్డీవో ల క్ష్మీప్రసన్న, అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట పలు శాఖల అధికారులు ఉన్నారు.
Updated Date - May 02 , 2025 | 12:14 AM