KKR Gowtham: కె.కె.ఆర్.గౌతమ్ విద్యాసంస్థల హవా
ABN, Publish Date - Apr 24 , 2025 | 04:59 AM
పదో తరగతి ఫలితాల్లో కె.కె.ఆర్.గౌతమ్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. 596 మార్కులు సాధించిన ఎం.దీపేష్ రెడ్డితోపాటు 500కు పైగా మార్కులు సాధించినవారి సంఖ్య 1,398కి చేరిందని యాజమాన్యం తెలిపింది.
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కె.కె.ఆర్.గౌతమ్ విద్యాసంస్థల యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 600 మార్కులకుగాను ఎం.దీపేష్ రెడ్డి 596 మార్కులు, ఎస్.జోయల్ త్యాగి, కె.లాస్య నాగశ్రీ, బి.కార్తీక్ గణేష్ రెడ్డి, ఆర్.రుక్కయ్య 595, గీతాశ్రీవాత్సవ్, ఎం.ప్రణీత్ సాయి విష్ణు, ఎం.వి.శ్రీసాయి దాక్షాయణి, బి.సాయి హన్సిత 594 మార్కులు సాధించారని పేర్కొంది. 46 మంది విద్యార్థులు 590 మార్కులకుపైగా, 208 మంది 580 మార్కులకుపైగా, 1,398 మంది 500 మార్కులకు పైగా సాధించారని తెలిపింది. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందిని అభినందించింది.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 24 , 2025 | 04:59 AM