ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Police: వైసీపీ నేత తురకా కిశోర్‌పై మరో కేసు

ABN, Publish Date - Jul 15 , 2025 | 05:23 AM

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. పార్టీ మారడం లేదన్న కారణంతో...

  • ఇప్పటికే ఏడు హత్యాయత్నం, మరో ఏడు ఇతర కేసులు

మాచర్లటౌన్‌, జూలై 14(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తురకా కిశోర్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదైంది. పార్టీ మారడం లేదన్న కారణంతో టీడీపీ నేత దారపనేని శ్రీనివాసరావుపై 2022 అక్టోబరు 7న తురకా కిశోర్‌, బోదలవీడుకు చెందిన మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబు మరికొందరు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాజాగా నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ దారపనేని ఆదివారం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కిశోర్‌తోపాటు ఇతర నిందితులపై హత్యాయత్నం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుల్లో మేదరమెట్ల శ్రీను, పంగులూరి బాబులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ సమందర్‌వలి తెలిపారు. ఇప్పటికే కిశోర్‌పై ఏడు హత్యాయత్నం కేసులు, మరో ఏడు ఇతర కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అజ్ఞాతంలోకి వెళ్లిన కిశోర్‌.. బెంగళూరు నుంచి ఈ యేడాది జనవరిలో హైదరాబాద్‌లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఏపీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మరోవైపు నెల క్రితమే ఆయనను మున్సిపల్‌ చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jul 15 , 2025 | 05:27 AM