ఆల్మేవా జిల్లా అధ్యక్షుడిగా ముక్తార్బాషా
ABN, Publish Date - May 11 , 2025 | 12:17 AM
కర్నూలు మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన (ఆల్మేవా) జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు మండలం పీఆర్ ఏఈ ముక్తార్బాషాను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
కర్నూలు రూరల్ మే10(ఆంధ్రజ్యోతి): కర్నూలు మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన (ఆల్మేవా) జిల్లా అధ్యక్షుడిగా కర్నూలు మండలం పీఆర్ ఏఈ ముక్తార్బాషాను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం స్థానిక కర్నూలు మండల ప్రజాపరిషత సమావేశ భవనంలో కర్నూలు జిల్లా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన నూతన కార్య నిర్వాహక కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రానబాషా, రాష్ట్ర కార్యవర్గం గౌరవ అధ్యక్షుడు ఎస్ఎండీ అబులైస్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అంజాద్పాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆల్మేవా నూతన కమిటీ లో కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ మౌళీబాషా, అసోసియేట్ ప్రసిడెంట్ హుస్సేన, వైస్ప్రసిడెంట్గా జాకీర్హుస్సేన, పీఎండీ అబ్దుల్ కలీఖ్, మహమ్మద్హక్, హుస్సేనసాబ్, జిల్లా జనరల్ సెక్రటరి షేక్మహమ్మద్రియాజ్బాషాతో పాటు మరి కొంతమంది ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా నంద్యాల జిల్లా ప్రధానకార్యదర్శి ఎస్ఎండీ సలీమ్ వ్యవహరించారు.
Updated Date - May 11 , 2025 | 12:17 AM