Kakinada : సెల్ఫోన్ మింగి మానసిక రోగి మృతి
ABN, Publish Date - Jan 27 , 2025 | 05:54 AM
రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకుచెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) మానసిక రుగ్మతలతో బాధపడుతోంది.
జీజీహెచ్(కాకినాడ), జనవరి 26(ఆంధ్రజ్యోతి): సెల్ఫోన్ మింగిన మానసిక రోగి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకుచెందిన పెనుమళ్ల రమ్య స్మృతి(35) మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. కుటుంబీకులు ఆమెను శనివారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె అక్కడ కీ ప్యాడ్ సెల్ఫోన్ను మింగేసింది. ఆమెకు శస్త్ర చికిత్స చేసి వైద్యులు సెల్ఫోన్ను తొలగించారు. కానీ అన్నవాహికకు సంబంధించిన ఈసోపేగస్ పూర్తిగా దెబ్బతింది. వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు శనివారం రాత్రి కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రాజమహేంద్రవరం వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు విడిచిందని మృతురాలి తండ్రి ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Updated Date - Jan 27 , 2025 | 05:54 AM