Home » Kakinada
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోవూరు బ్రిడ్జి వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీస్ కస్టడీ ముగిసింది. ఈరోజు వైద్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని జీజీహెచ్ ఆస్పత్రికి పోలీసులు తీసుకొచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రత్యేక సదుపాయాలు కోరిన అంశంపై జైలు అధికారులు స్పందించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారమే సదుపాయాలు కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం నడుపుతున్న మైసూరు-కాకినాడటౌన్ స్పెషల్ బైవీక్లీ ఎక్స్ప్రెస్ (07033/34)ను ఇకపై రెగ్యులర్ బైవీక్లీ ఎక్స్ప్రెస్గా ప్రమోట్ చేశారు.
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడలోని మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పవరం ఇన్ఛార్జి సీఐ రవికుమార్ను ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు నుంచి తొలగించారు.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డబ్బులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెదిరింపులకు భయపడి నలుగురు సాక్షులు పోలీసులను ఆశ్రయించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం వద్ద పోలీసు అధికారి గన్ మిస్ఫైర్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ధనరాజు ఛాతిలోంచి బుల్లెట్ బయటకు వచ్చింది.