Home » Kakinada
పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. ఈ పరిస్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది.
తెలిసినవారి ఇంట్లో ముగ్గురు యువకులు దొంగతనానికి తెగబడ్డారు. చోరీ సొత్తును సమంగా పంచుకున్నారు. తీరా ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో సొత్తును మూటగట్టి దొంగతనం చేసిన ఇంట్లోకే విసిరేశారు. ఆపై సంఘ పెద్దలకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో.. వారు ముగ్గురు నిందితులనూ పోలీసులకు అప్పగించారు.
ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గోదావరి వరద జులైలోనే 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
కాకినాడ జిల్లా, గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.