సమ్మెను జయప్రదం చేద్దాం
ABN, Publish Date - May 16 , 2025 | 12:01 AM
కార్మికుల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు పోరాడతామని రై తు, కార్మిక సం ఘాల నాయకులు హెచ్చరించారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు, కార్మిక సంఘాల నేతలు
రాయచోటిటౌన, మే15(ఆంధ్రజ్యోతి): కార్మికుల నడ్డి విరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు అయ్యేంత వరకు పోరాడతామని రై తు, కార్మిక సం ఘాల నాయకులు హెచ్చరించారు. గురువారం రాయచోటి పట్ణంలోని ఎన్జీవో హోంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీ. భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు విశ్వనాథ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ప్రైవేటు ఎలక్ర్టికల్ యూనియన జిల్లా అధ్యక్షుడు అస్లాం, మున్సిపల్ వర్కర్స్ యూనియన జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నయ్య, శంకరయ్య, యూఈసీడబ్ల్యుయూ డిస్కమ్ నాయకుడు సుబ్రమణ్యంరాజు, రైతు సంఘం ఉపాధ్యక్షులు నాగబసిరెడ్డి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన జిల్లా సహాయ కార్యదర్శి ఓబులమ్మ తదితరులు మాట్లాడుతూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం లేబర్ కోడ్స్ తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నెల 20న జరిగే సమ్మెలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి కార్మిక ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Updated Date - May 16 , 2025 | 12:04 AM