ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ABN, Publish Date - Jul 08 , 2025 | 01:19 AM
ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ద్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం కడమకుంట్లలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు.
తుగ్గలి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ద్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం కడమకుంట్లలో సుపరిపాలనలో తొలి అడుగు నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని, సమస్యలను తెలుసుకున్నారు. ఏడాదిలోనే సూపర్సిక్స్లో నాలుగింటిని అమలు చేశామన్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మించామని, గత వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి రాష్ట్రాన్ని అధఃపాతాలానికి నెట్టిందన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, ట్రైబల్ సలహా మండలి సభ్యులు వెంకటపతి, మనోహర్ చౌదరి, తిరుపాల్నాయుడు, వెంకటస్వామి, మాజీ సర్పంచ్ ఫక్కీరప్ప ఉన్నారు. అనంతరం రైతులకు కంది విత్తనాలను అందజేశారు. తుగ్గలి మండలానికి 89 యూరియా యూనిట్లు ఉన్నాయని, వందశాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలను ఇస్తున్నామన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 01:19 AM