రైతులకు న్యాయం చేస్తాం
ABN, Publish Date - May 08 , 2025 | 12:20 AM
ప్రతి రైతుకు భూ రీసర్వే ద్వారా న్యాయం చేస్తామని ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ అన్నారు.
సబ్ కలెక్టర్ భరద్వాజ్
నందవరం, మే 7(ఆంధ్రజ్యోతి): ప్రతి రైతుకు భూ రీసర్వే ద్వారా న్యాయం చేస్తామని ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ అన్నారు. మండలంలోని ముగతి గ్రామంలో బుధవారం తహసీల్దార్ శ్రీనివా సులు ఆధ్వర్యంలో రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి రైతుకు ముందుగానే నోటీసులు జారీ చేయడంతో అధిక సంఖ్య లో పొలాల రీసర్వే కోసం రైతులు వచ్చారు. అలాగే ఇబ్బందులు ఉన్న రీ సర్వే పొలాల రికార్డులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. ఎవరికి ఇ బ్బంది లేకుండా చూస్తానని రైతులకు భరోసా కల్పించారు. రైతుల సరి హద్దుల వరకు చూపించారు. ఇంకా ఎవరైనా పొలాల దగ్గర ఇబ్బం దులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో రీ సర్వే డీటీ మహేష్, తాలుకా సర్వేయర్ శ్రీనివాసరాజు మండల సర్వే యర్ అక్బర్బాషా, శేఖర్, వీఆర్వో రాఘవేంద్ర, రైతులు పాల్గొన్నారు.
Updated Date - May 08 , 2025 | 12:20 AM