విద్యార్థుల భవిష్యత్తుకు పాటుపడాలి
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:30 PM
ప్రతి ఉపాఽఽధ్యా యుడు విద్యార్థుల భవిష్యత్కు పాటుపడాలని జిల్లా సమగ్రశిక్షా అభి యాన్ ఏపీసీ ప్రేమంత్కుమార్ కోరారు.
ఏపీసీ ప్రేమంత్కుమార్
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఉపాఽఽధ్యా యుడు విద్యార్థుల భవిష్యత్కు పాటుపడాలని జిల్లా సమగ్రశిక్షా అభి యాన్ ఏపీసీ ప్రేమంత్కుమార్ కోరారు. బండి ఆత్మకూరు మండ లంలోని ప్రభాత్ కళాశాలలో మోడల్ ప్రీ ప్రైమరీ పాఠశాలల ప్రధానో పాధ్యాయులకు నాలుగు రోజుల పాటు నిర్వహి స్తున్న స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ నాలుగరోజుల కార్యక్రమాన్ని సోమ వారం ఏపీసీ ప్రేమంత్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైన తాను విద్యా వ్యవస్థలో పనిచేయాలనే సంకల్పంతో సర్వశిక్ష అభియాన్కు ఏపీసీగా రావడం జరిగిందన్నారు. పాఠశాలలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తా మని, ప్రతి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులతో మమేకమవుతూ నాయ కత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. అందరినీ సమన్వయం చేసుకుం టూ మంచి బోధనా పద్ధతులతో మార్గనిర్దేశకులుగా ఉండాలని కోరారు. పదిమంది ప్రత్యేక మోటివేటర్స్ నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకుని విద్యా ర్థుల భవిష్యత్కు పటిష్ట పునాదులు వేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఏఎంవో మాధవీలత, బండిఆత్మకూరు ఎంఈవోలు యశోద, మోహన్రెడి,్డ ప్రభాత్ విద్యాసంస్థల నిర్వాహకులు సారధిబాబు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 14 , 2025 | 11:30 PM