అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..
ABN, Publish Date - Jul 22 , 2025 | 12:16 AM
కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూలై 21(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన వార్డుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సోమ వారం 35, 36 వార్డుల పరిధిలోని గనిగుంతలు, అయ్యవారి నాగలాపురంలో టీటీడీ బోర్డ్ సభ్యుడు మల్లెల రాజశేఖర్తో కలిసి ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక ్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. 35వ వార్డు గనిగుంతల్లో రూ.35 లక్షలు, అయ్యవారి నాగలాపురంలో రూ.20 లక్షలతో డ్రైనేజీ కాల్వల నిర్మా ణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రేణుక, ఏపీ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్ రామాంజనేయులు, 36వ వార్డు టీడీపీ ఇనచార్జి తిరుమలేశ్వరరెడ్డి, క్లస్టర్ కో-ఆర్డినేటర్ లోకేశ్వర రెడ్డి, ఎన్వీ రామకృష్ణ, పీయూ.మాదన్న, రవిప్రకాష్రెడ్డి, కేతూరు మధు, మాదేష్, పెద్ద బీచుపల్లి, సుబ్బారెడ్డి, చక్రపాణిరెడ్డి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 22 , 2025 | 12:16 AM