విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి
ABN, Publish Date - May 27 , 2025 | 12:19 AM
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, తొలగించిన 45 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ డిమాండ్ చేశారు.
కర్నూలు న్యూసిటీ, మే 26(ఆంధ్రజ్యోతి): విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, తొలగించిన 45 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కార్మి కులకు మద్దతుగా సోమవారం కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వ ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయ డానికి కుట్ర లు పన్నుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని కల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చారని అన్నారు. ఏఐ టీయూసీ నగర కార్యదర్శి చంద్రశేఖర్, సీఐటీయూ నగర కార్యదర్శి సాయి బాబా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, జిల్లా సహాయ కార్య దర్శి శ్రీనివాసరావు, నాయకులు నల్లన్న, రాము, నాగరాజుపాల్గొన్నారు.
Updated Date - May 27 , 2025 | 12:19 AM