నాగలి పట్టిన కలెక్టర్
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:20 AM
నంద్యాల జిల్లా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఘనంగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు.
నంద్యాల ఎడ్యుకేషన్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా సంస్థలో ఘనంగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి వేడుకలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. రైతులు, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల మధ్య మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకను నిర్వహించారు. అందంగా అలంకరించిన ఎద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలెక్టర్ రాజకుమారి కాడిపట్టి నాగలితో అరక దున్నుతూ వ్యవసాయ పనులను ప్రారంభించారు.
Updated Date - Jun 12 , 2025 | 12:20 AM