ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు
ABN, Publish Date - Jun 30 , 2025 | 01:01 AM
నగర శివారులోని ఆదర్శ విద్యామందిర్ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్ అండర్-18 బాలబాలికల చాంపియనషిప్ పోటీలు ఆదివారం ముగి సాయి.
చాంపియన్సగా ప్రకాశం, గుంటూరు జట్లు
కర్నూలు బాలురకు రజతం, బాలికలకు కాంస్యం
కర్నూలు స్పోర్ట్స్, జూన 29(ఆంధ్రజ్యోతి): నగర శివారులోని ఆదర్శ విద్యామందిర్ క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్ అండర్-18 బాలబాలికల చాంపియనషిప్ పోటీలు ఆదివారం ముగి సాయి. ఈ సందర్భంగా ఆదర్శ విద్యామందిర్ డైరెక్టర్ డా.బి. హరికిషన, రాష్ట్ర రగ్బీ అసోసియేషన ప్రధాన కార్యదర్శి బి.రామాంజనేయులు విజే తలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేసి అభినందిం చారు. ఈ సందర్భంగా డా.హరికిషన మాట్లాడుతూ తమ విద్యాసంస్థ పలుమార్లు పోటీలకు వేదిక కావడం తనకు సంతోషంగా ఉందన్నారు.
విజేతల వివరాలిలా ఉన్నాయి:
ఫ బాలుర విభాగంలో ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచి బహుమతులు అందుకున్నారు.
ఫ బాలికల విభాగంలో గుంటూరు, అనంతపురం ఈస్ట్ గోదావరి జట్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ ముగింపు కార్యక్రమంలో రగ్బీ ఇండియా ప్రతినిధి నోయల్ మ్యాచ, వివిద జిల్లాలకు చెందిన రగ్బీ సంఘం ప్రతినిధులు చంద్ర శేఖర్, లక్ష్మణ్రావు, శంకరయ్య, మహబూబ్ సుభాని, కొండేపోగు చిన్న సుంకన్న, శేషయ్య, గీతా సుప్రియ, ఫాతిమా పాల్గొన్నారు.
Updated Date - Jun 30 , 2025 | 01:01 AM