భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం
ABN, Publish Date - May 05 , 2025 | 12:54 AM
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు.
మంత్రాలయం, మే 4(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావటంతో దక్షణాది రాష్ర్టాలనుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. బుధ, గురు, శుక్ర, శనివారం వరకు వేలాది మంది భక్తులు రావడంతో మఠం అతిధి గృహలు, ప్రైవేట్ లాడ్జీలు భక్తులతో నిండిపోయాయి. అద్దె రూములు దొరకక మధ్వమార్గ్ కారిడార్ ముందే భక్తులు బసచేశారు. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, ప్రధాన రహాదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదీతీరం భక్తులతో కోలాహాలంగా మారింది. గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైన్న్లు, పరిమళప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీమఠం అధికారులు ఏఏవో మాధవశెట్టి, మేనేజరు వెంకటేష్ జోషి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సొంత వాహనాల్లో వచ్చిన భక్తులు ప్రధాన రహదారిపై ఇరువైపులా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యతో భక్తులు, గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు.
Updated Date - May 05 , 2025 | 12:55 AM