ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:46 PM

అర్జీదారుల సమ స్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): అర్జీదారుల సమ స్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటో రియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కలెక ్టర్‌ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనం తరం కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. పీజీఆర్‌ఎస్‌ లాగిన్‌లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు. కర్నూలు అర్బన్‌ తహసీల్దార్‌ లాగిన్‌లో 21 రోజుల నుంచి రెండు అర్జీలు, కల్లూరు తహసీల్దార్‌ లాగిన్‌లో 3 అర్జీలు, సర్వశిక్ష అభియాన్‌, పీవో వద్ద 19 రోజుల నుండి ఒక అర్జీ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ వద్ద వారం రోజుల నుంచి ఒక అర్జీ, ఉద్యానవన శాఖ వద్ద ఒకటి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వద్ద ఒక అర్జీ చొప్పున పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సీఎంవో గ్రీవెన్స్‌లకు సంబంధించి ఆదోని సబ్‌ కలెక్టర్‌ వద్ద 10, పత్తికొండ ఆర్డీవో వద్ద 6, కర్నూలు ఆర్డీవో వద్ద 5, సర్వే ఏడీ వద్ద 2, కార్మిక శాఖ డిస్ర్టిక్ట్‌ రిజిస్ర్టార్‌ వద్ద ఒక్కో దరఖాస్తు చొప్పున పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో సి. వెంకటనారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అనూరాధ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:46 PM