ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు గ్రామీణ వైద్యుల సదస్సు

ABN, Publish Date - Jul 15 , 2025 | 11:59 PM

ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి తెలిపారు.

గోవిందరెడ్డి

జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు గోవిందరెడ్డి

కర్నూలు హాస్పిటల్‌, జూలై 15(ఆంఽధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల సదస్సును బుధవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి తెలిపారు. మంగళవారం నగరంలోని ఓమిని హస్పిటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సుకు మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎంపీలు బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీడీ జనార్దన్‌ హాజరు అవుతారన్నారు. నగరంలోని బిర్లా కాంపౌండ్‌ పక్కన ఉన్న శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో ఈ సదస్సు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరుగుతుందని అన్నారు. మూడు వేల మంది దాకా హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:59 PM