అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించండి
ABN, Publish Date - May 20 , 2025 | 11:52 PM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి గనియా సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి గనియా
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
నంద్యాల నూనెపల్లె, మే 20 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి గనియా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేసు వివరాలతో కూడిన నివేదికలను వారం రోజులకు ముందుగానే డీవీఎన్సీ సభ్యులు అందజేయాలని ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన అంశాలకు కలెక్టర్ సమాధానం చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీల వివరాలు తెప్పించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ విష్ణుచరణ్, ఏఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీవోలు విశ్వనాథ్, నరసింహులు, అరుణజ్యోతి, ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి చింతామణి, డీఎంహెచ్వో డా.వెంకటరమణ, నంద్యాల అదనపు మున్సిపల్ కమిషనర్ వెంకటదాస్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 11:52 PM