సమస్యలు పరిష్కరించాలి
ABN, Publish Date - May 21 , 2025 | 12:29 AM
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు మంగళవారం నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో దీక్ష చేపట్టారు.
శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల దీక్ష
కర్నూలు హాస్పిటల్, మే 20(ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు మంగళవారం నగరంలోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్లో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ ప్రారంభించి మాట్లా డారు. గత 9 సంవత్సరాలుగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లు కేవ లం రూ.7,870 వేతనంతో పని చేస్తున్నారని, ప్రభుత్వాలు మారినా కూడా వేతనాలు పెరగడం లేదని అన్నారు. చాలీచాలని వేతనాలతో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, డ్రైవర్లకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, 8 గంటల పనివిధానం అమలు చేయాలని, ప్రభుత్వ సెల వులు వర్తింపజేయాలని కోరారు. అనంతరం దీక్ష శిబిరం నుంచి ఉద్యో గులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. కార్యక్ర మంలో ఏపీ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు అండ్ ఎంప్లాయీస్ యూని యన జిల్లా అధ్యక్షుడు కే.రంగస్వామి, జిల్లా కార్యదర్శి నరేష్, ఉపాధ్య క్షుడు పవన కుమార్, కోశాధికారి నరేంద్రరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:29 AM