వెండి రథంపై ప్రహ్లాదరాయలు
ABN, Publish Date - May 29 , 2025 | 12:48 AM
రాఘవేంద్రస్వామి మఠం లో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
వెండి రథంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు
మంత్రాలయం, మే 28(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠం లో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు వెండి రథంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. బుధవారం అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. బృందావనాన్ని బంగారు, వెండి, పట్టువస్ర్తాలు, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారి పాదపూజ అనంతరం వెండి రథాన్ని అలంకరించి స్వామివారి ఊరేగింపు నిర్వ హించారు. అనంతరం ఊంజల సేవ నిర్వహించారు. వివిధ రాష్ర్టా ల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
Updated Date - May 30 , 2025 | 03:10 PM