అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలి: కలెక్టర్
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:05 AM
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
పీజీఆర్ఎ్సకు 172 వినతులు
నంద్యాల నూనెపల్లె, జూన్ 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎ్స హాల్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజలనుంచి కలెక్టర్, జేసీ విష్ణుచరణ్, డీఆర్వో రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు. పీజీఆర్ఎ్సకు 172వినతులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలనుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు.
Updated Date - Jun 17 , 2025 | 12:05 AM