అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
ABN, Publish Date - Jul 14 , 2025 | 11:29 PM
పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీల పరిష్కారంలో ఏ మాత్రం జాప్యం చేయవద్దని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీల పరిష్కారంలో ఏ మాత్రం జాప్యం చేయవద్దని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. నంద్యాల కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొని 326 మంది నుంచి అర్జీలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. జిల్లాలో రెవెన్యూ, రీసర్వే అంశాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఆర్డీవోలు ప్రతిరోజు తహసీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అర్జీలను గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్కు వచ్చే విభిన్న ప్రతిభా వంతుల కోసం ముగ్గురు సహాయకులను నియమించినట్లు తెలిపారు.
Updated Date - Jul 14 , 2025 | 11:29 PM