‘మహానంది’ హుండీ ఆదాయం రూ.62.18 లక్షలు
ABN, Publish Date - May 29 , 2025 | 10:58 PM
మహానంది దేవస్థానంలోని ఉభయ ఆలయాల హుండీలను గురువారం అధికారులు లెక్కించారు.
మహానంది, మే 29 (ఆంధ్రజ్యోతి): మహానంది దేవస్థానంలోని ఉభయ ఆలయాల హుండీలను గురువారం అధికారులు లెక్కించారు. గడిచిన 61 రోజులకు గాను హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.62.17,845 సమకూరినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయ హుండీ నుంచి రూ.61,59,832, అన్నప్రసాదం హుండీ రూ.26,683, గోసంరక్షణ హుండీ నుంచి రూ.31,330 చొప్పున మొత్తం రూ.62,17,845 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. అలాగే హుండీలో వివిధ దేశాల కరెన్సీలు లభించాయన్నారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్ధానం సిబ్బంది ఏవో మధు, పర్యవేక్షకులు శశిధర్ రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, ఇన్స్పెక్టర్లు, వెలుగోడు గ్రూప్ దేవాలయాల ఈవో జనార్దన్, అర్చకులు, సిబ్బంది, శివ సేవకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 29 , 2025 | 10:58 PM