టీడీపీతో అన్ని వర్గాలకు న్యాయం
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:01 AM
టీడీపీ ప్రభుత్వంతోనే అన్నివర్గాలకు న్యాయం చేకూరుతుందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు చందోలి తిరుపాల్తో కలసి గురువారం పత్తికొండలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.
వర్గీకరణకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు
ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పత్తికొండ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వంతోనే అన్నివర్గాలకు న్యాయం చేకూరుతుందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు చందోలి తిరుపాల్తో కలసి గురువారం పత్తికొండలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. వర్గీకరణకు మొదటి నుంచి చంద్రబాబు మద్దతుగా నిలిచారని, నేడు వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసి ఇచ్చిన మాటను నిలుపుకున్నా రన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ర్టాభివృద్ధికి కృషిచేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రానున్నరోజుల్లో రాష్ట్రం అగ్రస్ధానంలో నిలుస్తుందన్నారు. తిరుపాల్ మాట్లాడుతూ ఎస్సీవర్గీకణపై ఆర్డినెన్స్ జారీ చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ బీసీ సెల్ నాయకులు రామానాయుడు, కన్వీనర్ కడవల సుధాకర్, శ్రీనివాసులు గౌడ్, ఎస్సీసెల్ నాయకులు బోనాల కాశీ, ఉచ్చీరప్ప, హోసూరు అంజి, దూదేకొండ సుధాకర్ ఉన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:01 AM