విచారణ జరిపి న్యాయం చేయండి
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:35 AM
పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా ఆదేశించారు.
ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 160 ఫిర్యాదులు
నంద్యాల టౌన్, జూన్30 (ఆంధ్రజ్యోతి): పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా ఆదేశించారు. సోమవారం పోలీసు ప్రజా సమస్యల పిర్యాదు వేదికకు 160 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదుల్లో ఎక్కువగా కుటుం బ కలహాలు, పొలం తగదాలు వస్తున్నాయని అన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన దాసరి చిన్న రవికి కొలిమిగుండ్ల మం డలం కంబవారిపల్లెకు చెందిన వడ్డె శంకర్నారాయణ రైల్వేలో టీసీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 12:35 AM