ఉపాధి వేతనాలు ఇవ్వాలి
ABN, Publish Date - Apr 18 , 2025 | 12:02 AM
పెండింగ్ ఉపాధి వేతనాలను చెల్లించాలని కూలీలు డిమాండ్ చేశారు. గురువారం వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు
పత్తికొండ టౌన్, ఏప్రిల్ 17 (ఆంధ్ర జ్యోతి): పెండింగ్ ఉపాధి వేతనాలను చెల్లించాలని కూలీలు డిమాండ్ చేశారు. గురువారం వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి వెంకటే శ్వరరెడ్డి మాట్లాడుతూ మండుటెండలో పని చేస్తున్న కూలీలకు నెలల తరబడి వేతనాలు ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నిం చారు. పనిదినాలను పెం చాలని, కనీస వేతనం రూ.700లు వచ్చేలా చూ డాలన్నారు. పని ప్రదేశాల్లో టెంట్లు, మజ్జిగ ప్యాకెట్లు, నీటి వసతి, గడ్డపారలు ఇవ్వాలని కోరారు. అనంరతం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నరసన్న, దస్తగిరి, బొజ్జులు, గోపాల్, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.
Updated Date - Apr 18 , 2025 | 12:02 AM