జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో రైతుబిడ్డకు 131వ ర్యాంక్
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:52 PM
జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో రైతు బిడ్డ 131వ ర్యాంక్ సాధించాడు.
ప్రణ్య్రెడ్డి
బండిఆత్మకూరు, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో జాతీయ స్థాయిలో రైతు బిడ్డ 131వ ర్యాంక్ సాధించాడు. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలోని పరమటూరు గ్రామానికి చెందిన పబ్బతి సుధాకర్రెడ్డి, రాధమ్మల కుమారుడు ప్రణ్య్రెడ్డి విజయవాడలోని చైతన్య కళాశాలలో ఎంపీసీ చదివాడు. జేఈఈ మెయిన్ పరీక్షలు రాశాడు. శుక్రవారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ప్రణయ్రెడ్డి 99.994 శాతం మార్కులతో జాతీయ స్థాయి 131వ ర్యాంక్ సాధించాడు. గ్రామంలో పలువురు రైతులు, నాయకులు, చిన్ననాటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, బంధువులు ప్రణయ్ను అభినందించారు.
Updated Date - Apr 19 , 2025 | 11:52 PM