20 ఏళ్ల తర్వాత కలిశారు
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:04 AM
నెహ్రూ మెమొరియల్ పురపాలక ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలిశారు.
2005-06 విద్యార్థుల సమ్మేళనం
ఆదోని అగ్రికల్చర్, జూలై 27 (ఆంధ్ర జ్యోతి): నెహ్రూ మెమొరియల్ పురపాలక ఉన్నత పాఠశాల 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలిశారు. తమ పాఠశాలను చూసి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఉదయం పాఠశాలకు చేరుకొని నాడు చదువులు నేర్చు కున్న తరగతికి వెళ్లి అప్పుడు చేసిన అల్లర్లను వారంతా జ్ఞాపకం వేసుకున్నారు. హెచ్ఎం ఫయాజుద్దీన్ నాటి గురువులు జయమ్మ, రామకృష్ణ, శర్మ, బాబు సాహెబ్ జాన్ విక్టర్లను సన్మానించారు. పూర్వ విద్యార్థులు శ్రీమన్నారాయణ, విజయ లక్ష్మి, జయరాం, అంజి, చింతలముని, శాంత కుమారి, తాయన్న, ఉరుకుందు, విశ్వనాథ్, జ్యోతి, ఉష, అయ్యప్ప పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 12:04 AM