చంద్రబాబు రైతుపక్షపాతి
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:12 AM
సీఎం చంద్రబాబు రైతుపక్షపాతి అని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. బుధ వారం మండలంలోని పందికోన గ్రామంలో వ్యవసాయ సంచాలకుడు మోహన్విజయ్కుమార్ ఆద్వర్యంలో సబ్బిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీచేశారు.
ఎమ్మెల్యే శ్యాంబాబు.. రైతులకు విత్తనాల పంపిణీ
పత్తికొండ, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు రైతుపక్షపాతి అని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. బుధ వారం మండలంలోని పందికోన గ్రామంలో వ్యవసాయ సంచాలకుడు మోహన్విజయ్కుమార్ ఆద్వర్యంలో సబ్బిడీ వేరుశనగ విత్తనాలను పంపిణీచేశారు. ఈఏడాది ముం దస్తు వర్షాలతో భూములు పదునుకావడంతో రైతుల అవస రాన్ని గమనించి సబ్సిడీ విత్తనాలను అందజేస్తున్నా మన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం రాయితీతో విత్తనాలను ప్రభుత్వ పంపిణీచేస్తుందన్నారు. హంద్రీ కాలువ విస్తరణతో రాకపోకలకు ఇబ్బందులు వస్తున్నా యని గ్రామస్థులు తన దృష్టికి తెచ్చారని కాంట్రాక్టర్తో మాట్లాడి రక్షణవలయాలను ఏర్పాటుచేయిస్తా మన్నారు. సర్పంచ్ మంజుల, టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, రామానాయుడు, కడవలసుధాకర్, చెన్నంనాయుడు, లోక్నాధ్, వ్యవసాదికారి వెంకటరాముడు, ఏఈవోలు రియాజ్, శ్రీనాఽధ్ తదితరులు పాల్గొన్నారు.
సుభిక్ష పాలన అందించాం
రాష్ట్ర ప్రజలు సుభిక్ష పాలన అందించామని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టి ఏడాదిపూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్చేశారు.
Updated Date - Jun 05 , 2025 | 12:12 AM